‘గరం’ గరంగా ఆది,అదా శర్మ (‘హార్ట్ ఎటాక్’ ఫేమ్)
ఆది, అదా శర్మ (‘హార్ట్ ఎటాక్’ ఫేమ్) జంటగా దర్శకుడు మదన్ రూపొందిస్తున్న ‘గరం’ చిత్రం షూటింగ్ శుక్రవారం రామానాయుడు స్టూడియోస్లో ప్రారంభమైంది. ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్కుమార్ ఎం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రాజశ్రీ, సాయిరాజ్ క్లాప్నివ్వగా ఎత్నిక్ టుబాకో గ్రూప్ అధినేత టి. వెంకట్రావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఆది మాట్లాడుతూ ‘‘ఇది నాకు ఏడో చిత్రం. ‘గరం’ టైటిల్ అందరూ బాగుందంటున్నారు. మంచి కథతో, కొత్తరకం స్ర్కీన్ప్లేతో సినిమా తయారవుతోంది’’ అన్నారు. ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో తనను బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు, ఈ సినిమాలోనూ తన పాత్రను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు అదా శర్మ తెలిపారు. మదన్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ నా కథలతోనే సినిమాలు రూపొందించిన నేను మొదటిసారి నా అసిస్టెంట్ శ్రీనివాస్ ఇచ్చిన కథతో ఈ సినిమా రూపొందిస్తున్నా. ప్రేమతో సమస్యను అధిగమించవచ్చనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. ఆది పోషిస్తున్న పాత్రలో చాలామంది తమను తాము చూసుకుంటారు. అగస్త్య ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తున్నారు’’ అని చెప్పారు. వినాయక్ వంటి డైరెక్టర్ డీల్ చేయాల్సిన సబ్జెక్టును మదన్ తీస్తున్నారని నిర్మాత రాజ్కుమార్ అన్నారు. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామనీ, డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయాలనేది తమ సంకల్పమనీ తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి, స్ర్కీన్ప్లే: మదన్, పాటలు: చైతన్యప్రసాద్, భాస్కరభట్ల రవికుమార్, సంగీతం: అగస్త్య, ఛాయాగ్రహణం: టి. సురేంద్రరెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగిరెడ్డి బి., లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి.