loading...

Thursday 4 September 2014

ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు - రాఘవ లారెన్స్‌ -(Andhrajyothi News Paper)

0 comments
            
     
                 ‘‘రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులకు కొత్తదనం అందించడం కోసం ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నాను. రెండు విభిన్న కథలతో ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు చూపించబోతున్నాను’’ అని చెప్పారు రాఘవ లారెన్స్‌. ప్రస్తుతం ‘ముని 3: గంగ’ చేస్తున్న ఆయన డిసెంబర్‌లో ఓ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. గురువారం నిర్మాతల మండలి హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. ‘‘రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై డిసెంబర్‌లో ‘ముసలోడు’, ‘ది లేటెస్ట్‌’ అనే సినిమాలను తెరకెక్కించబోతున్నాను. ఒక్కో సినిమా నిడివి గంట ఇరవై నిమిషాలు ఉంటుంది. ఈ రెండింటిని ఒకే తెరపై చూపిస్తాం. ఇంటర్వెల్‌ వరకు సాగే ‘ముసలోడు’ చిత్రంలో నాయికగా ఆండ్రియాను అనుకుంటున్నాం. ‘ది లేటెస్ట్‌’లో లక్షీరాయ్‌ నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నేనే లీడ్‌ రోల్‌ చేస్తున్నాను. ‘స్టైల్‌’ సినిమా సమయంలో వెన్నెముకకి చిన్న గాయమైంది. అది ఇప్పుడు ప్రాబ్లమ్‌గా మారడంతో ఐదు నెలలు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవల్సి వచ్చింది. అందుకే ‘గంగ’ సినిమా షూటింగ్‌కి విరామం కలిగింది. ఇటీవల క్లైమాక్స్‌ షూటింగ్‌ ప్రారంభించాం. మరో ఇరవై రోజుల్లో పూర్తవుతుంది. సీజీ వర్క్‌కి రెండు నెలలు సమయం పడుతుంది. డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని వివరించారు. లక్ష్మీరాయ్‌ మాట్లాడుతూ ‘‘కాంచన చిత్రం తరువాత రాఘవతో నటించనుండటం ఆనందంగా అనిపిస్తోంది. ‘ది లేటెస్ట్‌’లో కొత్త లక్ష్మీరాయ్‌ని చూడబోతున్నారు. ఇందులో పేదింటి అమ్మాయిగా నటింబోతున్నా’’ అని అన్నారు.

No comments:

Post a Comment