దిక్కులు చూడకు రామయ్య’ 19న ఆడియో విడుదల
అజయ్, నాగశౌర్య హీరోలు సనా మక్బూల్, ఇంద్రజ కథానాయికలుగా రాజమౌళి శిష్యుడు త్రికోటిని దర్శకునిగా పరిచయం చేస్తూ వారాహి చలనచిత్రం పతాకంపై రూపుదిద్దుకొంటున్న ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రం ఆడియో ఈ నెల 19న మార్కెట్లో విడుదలవుతుంది.
సాయిశివాని సమర్పణలో రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సనా మక్బూల్, ఇంద్రజ కథానాయికలు. ఈ సందర్భంగా సాయి కొర్రపాటి మాట్లాడుతూ ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాల తరువాత మా బేనర్ నుంచి వస్తున్న ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంతో హ్యాట్రిక్ సాధిస్తామనే నమ్మకం ఉంది. అజయ్, నాగశౌర్య, ఇంద్రజ, సనా ఇలా ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. ఎటువంటి అసభ్యత, అశ్లీలత లేకుండా సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కీరవాణిగారి సంగీతం మా చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతుంది. 19న ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించనున్నాం’ అని తెలిపారు.