loading...

Saturday 30 August 2014

‘కరెంట్‌ తీగ’కు రెండు పాటలే మిగిలాయి

0 comments
                                    

                           
 ‘కరెంట్‌ తీగ’కు రెండు పాటలే మిగిలాయి



                             మంచు మనోజ్‌ కథానాయకుడిగా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘కరెంట్‌ తీగ’. డా. మోహన్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నాయిక కాగా, సన్నీ లియోన్‌ ఓ స్పెషల్‌ కేరక్టర్‌లో కనిపించబోతున్నారు. ఇటీవలే తిరుపతిలో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలే మిగిలున్నాయని నిర్మాత విష్ణు తెలిపారు. ‘‘మనోజ్‌ డేర్‌డెవిల్‌ స్టంట్స్‌, సన్నీలియోన్‌ అందాలు, రకుల్‌ప్రతీ అభినయం, నాగేశ్వరరెడ్డి దర్శకత్వ ప్రతిభ, అచ్చు సమకూర్చిన బాణీలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అని ఆయన చెప్పారు.

Source : Andhrajyothy News paper

No comments:

Post a Comment